03/02/2023
https://digital.keratam.in/view/1534/keratam
*విజ్ఞాన శిఖరం సెయింట్ జోసెఫ్ స్కూల్..*
ఆ విద్యా సంస్థ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ దృఢమైన నమ్మకం... విద్యార్థుల మనసుల్లో అచంచెల ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. పదో తరగతి ఫలితాలొచ్చాయంటే ఇక విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు ర్యాంకుల పంటే... ఒక్కటి కాదు.. రెండు కాదు పదో తరగతి ఫలితాల్లో లెక్కకు మించి కొనసాగుతున్న ర్యాంకుల పరంపర... అందుకే ఇక్కడ అందించిన విద్యను తమ భవిష్యత్తుకు పునాది రాళ్లుగా వేసుకున్న విద్యార్థులు ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులెందరో వివిధ ప్రపంచ దేశాల్లో ప్రముఖ సాఫ్ట్వేర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ప్రముఖ వ్యాపారవేత్తలుగా విరాజిల్లుతున్నారు. తమ విద్యకు పునాధులు వేసిన ఆ విద్యా సంస్థ పేరు ప్రపంచ అవనికపై సగర్వంగా రెపరెపలాడేలా చేస్తున్నారంటే అతిశయోక్తికాదు... సిరుల మాగాణి సింగరేణి సిగలో విద్యా కుసుమాలు వికసించేలా.. వినూత్న విద్యా భోదన అందిస్తూ.. ఎందరినో ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ.. జిల్లాకు చుక్కానిగా నిలుస్తోంది ఆ విద్యా సంస్థ. అరవై ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రయివేటు విద్యారంగంలో ఓ ప్రభంజనంలా దూసుకుపోతున్న ఆ విద్యాసంస్థ మరేదో కాదు... ‘‘సెయిట్ జోసెఫ్ హై స్కూల్’... దిగ్విజయంగా అరవై వసంతాలు పూర్తిచేసుకుని డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీలో ఏర్పాటు చేసిన *‘‘సెయింట్ జోసెఫ్ హైస్కూల్’’ ప్రస్థానంపై కెరటం ప్రత్యేక కథనం..*
శామ్, కెరటం ప్రతినిధి...✍️
https://digital.keratam.in/view/1534/keratam