Vasavi creative photography

Vasavi creative photography still photographer
telugu film industry

Contact for any events
HD video& photography, dhrone, led wall, candid photography etc.

please call for photo&videography any where in ap &telangana events , functions, marriages, birthday functions , seemantham, naming ceremony etc

*వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే..* *అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలిం...
16/06/2026

*వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే..*

*అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం.*

అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

👉ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు.

🌿13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి.

🌿13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది

🌿పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.

🌿ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు.

🌿80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలెట్. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

🌿ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము.

🌿80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.

🌿ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది.అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.

🌿ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు.

🌿అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే.

🌿ఈ ఆలయం ప్రపంచ గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది...🍁

మీకు తెలుసా..?నీటిపై తేలే రామసేతు ను నిర్మించిన నలుడు అతని తండ్రి ఎవరు.?👇వాల్మీకి రామాయణం, యుద్ధకాండ (సర్గ 22) ప్రకారం ర...
15/06/2026

మీకు తెలుసా..?
నీటిపై తేలే రామసేతు ను నిర్మించిన నలుడు అతని తండ్రి ఎవరు.?
👇

వాల్మీకి రామాయణం, యుద్ధకాండ (సర్గ 22) ప్రకారం రామసేతు నిర్మాణాo

సీతాన్వేషణ ముగిసిన తర్వాత, వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటాడు. లంకకు చేరుకోవడానికి మధ్యలో ఉన్న అపారమైన సముద్రం పెద్ద అడ్డంకిగా మారుతుంది. సముద్రుడు స్వయంగా వచ్చి తమకు దారి ఇవ్వాలని కోరుతూ శ్రీరాముడు మూడు రాత్రుల పాటు దర్భలపై శయనించి, (తపస్సు) చేస్తాడు.
కానీ సముద్రుడు ప్రత్యక్షం కాకపోవడంతో శ్రీరాముడికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. తన కోదండానికి బ్రహ్మాస్త్రాన్ని సంధించి, సముద్రాన్ని పూర్తిగా ఇంకించి వేస్తానని హెచ్చరిస్తాడు.

ఆ అస్త్ర తీవ్రతకు సముద్రంలోని జీవులన్నీ విలవిల్లాడిపోతాయి, సముద్రుడు భయంతో వణికిపోతూ, చేతులు జోడించి శ్రీరాముని ముందు ప్రత్యక్షమవుతాడు.

సముద్రుడు శ్రీరాముడితో ఇలా అంటాడు: "ప్రభూ! ప్రకృతి నియమాల ప్రకారం నేను లోతుగా, దాటడానికి వీలు లేకుండా ఉండటం నా స్వభావం. దాన్ని నేను మార్చుకోలేను. కానీ మీ సైన్యం లంకకు చేరడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. మీ వానర సేనలో 'నలుడు' అనే గొప్ప వానరుడు ఉన్నాడు. అతను సాధారణ వానరుడు కాదు, దేవశిల్పి అయిన "విశ్వకర్మ ఔరస పుత్రుడు"
"అయమస్తు నలో భాగీ కరుతు సేతుం మహోదధౌ |"
(ఈ నలుడు సముద్రంపై వారధిని నిర్మించగలడు. అతనికి ఆ సామర్థ్యం ఉంది.)

"తన తండ్రి అయిన విశ్వకర్మ నుండి నలుడికి అపారమైన నిర్మాణ జ్ఞానం, శిల్పకళా నైపుణ్యం లభించాయి. అతను సముద్రంలో ఏ రాళ్ళు, చెట్లు వేసినా... నేను వాటిని మునిగిపోకుండా, కదలకుండా నా శక్తితో ఒకే క్రమపద్ధతిలో నిలిపి ఉంచుతాను. కాబట్టి నలుడి ఆధ్వర్యంలో వంతెన నిర్మించండి" అని సముద్రుడు ఉపాయం చెప్తాడు.

సముద్రుడు అంతర్థానమైన తర్వాత, నలుడు సగర్వంగా ముందుకు వచ్చి శ్రీరాముడితో ఇలా అంటాడు: "ప్రభూ! సముద్రుడు చెప్పింది నిజం. నా తల్లికి నా తండ్రి విశ్వకర్మ ఒక వరం ఇచ్చారు — 'నీకు పుట్టే కొడుకు శిల్పకళలో నా అంతటి వాడు అవుతాడు' అని. ఆ విశ్వకర్మ అంశతో పుట్టినవాడిని నేనే. కానీ, అవతలి వాడు అడగకుండా మనకు ఉన్న గొప్పతనాన్ని మనమే చెప్పుకోకూడదు కాబట్టి, నేను ఇంతవరకు నా సామర్థ్యాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు ఈ సముద్రంపై వంతెన కట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను.

ఐదు రోజుల్లో అద్భుత నిర్మాణం (సేతు నిర్మాణం)
శ్రీరాముడి ఆజ్ఞతో, సుగ్రీవుడు వానర సైన్యాన్ని పురమాయిస్తాడు. లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు వంటి వీరుల పర్యవేక్షణలో కోట్లాది వానరులు అడవుల్లోకి, కొండల్లోకి వెళ్తారు.

మొదటి రోజు: వానరులు సాల వృక్షాలు, తాటి చెట్లు, మద్ది చెట్లు, పెద్ద పెద్ద రాళ్లను, కొండలను పెకలించి తెచ్చి సముద్రంలో వేయడం ప్రారంభించారు. నలుడు వాటన్నింటినీ క్రమపద్ధతిలో అమరుస్తూ
14 యోజనాల
పొడవు వంతెనను నిర్మించాడు.

రెండవ రోజు: వానరుల వేగం పెరిగింది. రెండవ రోజు 20 యోజనాల మేర నిర్మాణం పూర్తయింది.

మూడవ రోజు: మరింత సమన్వయంతో 21 యోజనాల వంతెనను పూర్తి చేశారు.

నాల్గవ రోజు: పట్టుదలగా పనిచేసి 22 యోజనాల మేర నిర్మించారు.

ఐదవ రోజు: మిగిలిన 23 యోజనాల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో, మొత్తం "100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు" గల అద్భుతమైన రామసేతు సిద్ధమైంది.

నలుడి నేతృత్వంలో ఐదు రోజుల్లో పూర్తయిన ఆ వంతెన ఆకాశంలో నక్షత్ర వీధిలా, సముద్రుడి నుదుటిపై సింధూర రేఖలా ఎంతో అందంగా, దృఢంగా కనిపించిందని వాల్మీకి మహర్షి వర్ణించారు. ఆ వంతెన మీదుగా మొదట హనుమంతుడు, అంగదుడు ఇరువైపులా రక్షణగా నడుస్తుండగా, శ్రీరాముడు, లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి విజయవంతంగా లంకకు చేరుకున్నారు.
ఇదీ వాల్మీకి రామాయణంలో చెప్పబడిన సంపూర్ణ రామసేతు నిర్మాణ వృత్తాంతం!

14/06/2026

కంచె ఐలయ్య గాడిదకి అంకితం..

ఈ వీరగాథను చదువుతుంటేనే రక్తం మరిగిపోతుంది..
చదవండి..

చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక గొప్ప యోధుడి కథ

"బనియా అంటే కేవలం లెక్కలు రాయడమే.. వ్యాపారం చేయడమే అనుకుంటే పొరపాటే..."

పటియాలా రాజ్యానికి కొండంత అండగా నిలిచిన దివాన్ నానుమల్ అగర్వాల్ గురించి తెలిస్తే, ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది!

సాధారణ.శకం. 1781..
పటియాలా మహారాజు అమర్ సింగ్ కన్నుమూశారు. సింహాసనంపై కూర్చున్నది కేవలం 6 ఏళ్ల చిన్నారి సాహిబ్ సింగ్.

రాజ్యంపై చుట్టూ ఉన్న గద్దల కన్ను పడింది. పటియాలాను ఎలాగైనా మింగేయాలని ఢిల్లీ నవాబు మజ్దుద్దౌలా సైన్యంతో దూసుకొస్తున్నాడు. మరి లోపల చూస్తే? ఒకేసారి మూడు తిరుగుబాట్లు చెలరేగాయి! రాజ్యం ముక్కలైపోయే పరిస్థితి వచ్చింది.

సరిగ్గా అలాంటి సంక్షోభ సమయంలో... ఒక అగర్వాల్ సింహంలా రణరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయనే దివాన్ నానుమల్..

ఆ చేతులు పెన్ను పట్టి లెక్కలు రాయలేదు, త్రాసు పట్టి తూకాలు వేయలేదు. నేరుగా కత్తి పట్టి యుద్ధానికి దూకాయి!

పటియాలాకు కేవలం 16 మైళ్ల దూరంలో ఉన్న "ఘరామ్" మైదానంలో ఢిల్లీ సైన్యంతో ముఖాముఖి తలపడ్డారు. సుల్తాన్ సైన్యాన్ని మట్టికరిపించి, పటియాలా రాజ్యాన్ని కాపాడారు!

ఆ తర్వాత భవానీగఢ్ సుబేదార్ మహాన్ సింగ్ చేసిన తిరుగుబాటును నానుమల్ తన అద్వితీయ పరాక్రమంతో అణచివేశారు. కోట సుమేర్ తిరుగుబాటును కూడా అంతే క్రూరంగా తొలగించి పారేశారు.

"వ్యాపారంతో పాటు ఆయుధ విద్యను కూడా నేర్చుకోండి" అని మహారాజ అగ్రసేన్ చెప్పిన మాటలను నానుమల్ అక్షరాలా నిజం చేసి చూపించారు.

ఆయన కేవలం ఒక వ్యాపార అగర్వాల్ వైశ్య కులంలో పుట్టిన వ్యక్తి మాత్రమే కాదు, పటియాలా ను కాపాడిన సాక్షాత్తు అంబికా మాత యొక్క సింహం!

"దివాన్ నానుమల్ జీ “
మీరు త్రాసుతో ధర్మాన్ని రక్షించారు, కత్తితో దేశాన్ని కాపాడారు..

ఆరేళ్ల బాల రాజును, ముక్కలవ్వాల్సిన రాజ్యాన్ని మీ గుండెలను అడ్డుపెట్టి పెట్టి కాపాడారు..

చరిత్ర మిమ్మల్ని మర్చిపోయి ఉండవచ్చు, కాంగ్రెస్ పార్టీ రాయించిన చరిత్ర పుస్తకాల్లో మీకు చోటు లభించక పోవచ్చు కానీ పటియాలాలోని ప్రతి ఇటుక మీ పేరును గుసగుసలాడుతూనే ఉంటుంది..

మీ శౌర్యానికి కోటి నమస్కారాలు. జై అగ్రసేన్, జై పటియాలా!"..
జై వాసవి 🙏

ఈ పోస్టుకు కూడా ఇద్దరు మందికి పుట్టిన గలీజ్ కొడుకులు లాఫింగ్ సింబల్ పెట్టారు..వాళ్ల తండ్రి గారి పేరు వారికి వాళ్ళ అమ్మగారు చెప్పి ఉండరు..బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ తీర్చుకున్నారు..

*ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి రహస్యం ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుంది?**జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను పెట్ట...
14/06/2026

*ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి రహస్యం ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుంది?*

*జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంటాం. కానీ మన ప్రయత్నంలో ఉన్న చిన్న చిన్న లోపాలు లేదా అనుకోని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు విజయానికి దూరమవుతుంటాం.*

*ఎంత కృషి చేసినా ఫలితం రాకపోతే, "ఇక్కడ దైవ అనుగ్రహం అవసరం" అనే భావన మనసులో కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో అపరాజిత దేవిని ప్రార్థిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం.*

ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి దర్శనం..

*విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత, గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఒక చిన్న అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఆమెనే అపరాజిత దేవి అని పిలుస్తారు. చాలామందికి ఈ విగ్రహం వెనుక ఉన్న మహాత్మ్యం తెలియకపోవచ్చు. కొందరు అక్కడ కుంకుమ, పసుపు వంటివి విసిరే విధంగా ప్రవర్తిస్తారు, కానీ అది సరైన పద్ధతి కాదని భక్తులు చెబుతారు. అపరాజిత దేవి చాలా శక్తివంతమైన దైవ స్వరూపం.*

అపరాజిత దేవి ప్రాముఖ్యత

*మన జీవితంలో విద్య, ఉద్యోగం, కుటుంబ స్థిరత్వం, సామాజిక గౌరవం వంటి విజయాలు క్రమంగా రావాలని మనం కోరుకుంటాం. ఈ అన్ని విజయాలను క్రమంగా ప్రసాదించే శక్తిగా అపరాజిత దేవిని భావిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో అడ్డంకులు తగ్గి ముందుకు సాగడానికి మార్గం సులభమవుతుందని నమ్మకం.*

అపరాజిత దేవి ఆవిర్భావ కథ

*దేవీ భాగవతం, చండీ సప్తశతి ప్రకారం, ఒకప్పుడు దేవతలు, అసురుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా దేవతలు విజయం కోసం పరమ శక్తిని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రతిస్పందనగా పరాశక్తి ఒక ప్రత్యేక రూపంలో ప్రత్యక్షమై దేవతలకు విజయాన్ని ప్రసాదించింది. ఆ దివ్య స్వరూపమే అపరాజిత దేవి అని చెబుతారు.*

అపరాజిత దేవి స్తోత్రం మహిమ

*చండీ సప్తశతిలో పేర్కొన్న అపరాజిత దేవి స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్మకం. ఈ కవచం వల్ల ప్రతికూల శక్తులు, ఆటంకాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే సంక్షోభ పరిస్థితుల్లో సరైన మార్గం కనిపించడానికి ఇది సహాయపడుతుందని చెబుతారు. ప్రతిరోజు లేదా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని చదవడం మంచిదని ఆచారం. ఇలా భక్తితో పఠిస్తే మనసులో స్థిరత్వం పెరిగి, ఆత్మవిశ్వాసం బలపడుతుందని భావిస్తారు.*

*🪷 అపరాజిత దేవి అనుగ్రహ ఫలితాలు 🪷*

*కష్టసమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు, సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కానప్పుడు అపరాజిత దేవిని ప్రార్థిస్తే మార్గదర్శనం లభిస్తుందని భక్తుల నమ్మకం. విద్యలో ఏకాగ్రత పెరగడం, పరీక్షల్లో మంచి ఫలితాలు రావడం వంటి అనుభవాలు కూడా చాలామంది చెబుతారు.*

నైవేద్యం, ఆచారాలు

శుక్రవారం రోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో అపరాజిత దేవికి పాలు, ఏలకులు కలిపిన నైవేద్యం లేదా పటిక బెల్లం సమర్పించడం ఆచారంగా ఉంటుంది. భక్తిశ్రద్ధలతో చేసిన ప్రార్థనలు, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. చివరగా, అపరాజిత దేవి ఆరాధన మనలో ధైర్యాన్ని పెంచి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మానసిక బలం అందిస్తుందని భక్తులు నమ్ముతారు.

🙏 ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ) ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేల్పును కొలుచుకోవ...
14/06/2026

🙏 ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ)

ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం.

ఇంటి గడపను సింహద్వారం, లక్ష్మీ ద్వారం, ద్వార లక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు ఎర్రమన్ను, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దల నుంచి సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు.

గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే uh సుఖసంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. అలాగే ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని హెచ్చరించడం.

ఇప్పుడు ఈ గడప పూజ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం.

పెళ్లి కాని అమ్మాయిలు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరక, జాతకం లేదా కానుకల విషయంలో ఏదో ఒక ఆటంకం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారు 16 రోజుల పాటు ఈ గడప పూజ చేయాలి.

పూజా విధానం

1. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి. 16 రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి.

2. ముందుగా గడపను నీటితో మూడు సార్లు కడగాలి. తరువాత కొద్దిగా పాలు పోసి అభిషేకం చేసినట్లుగా చేతితో తుడవాలి. అనంతరం మరోసారి నీటితో శుభ్రం చేయాలి.

3. గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి.

4. చిన్న పళ్లెంలో మూడు ఒత్తులను ఒకే దీపంలో అమర్చి, ఆవు నెయ్యి లేదా నూనె పోసి వెలిగించాలి.

5. మరో పళ్లెంలో బెల్లం, అటుకులు, తాంబూలం ఉంచాలి. ముందుగా వినాయకుడికి నమస్కరించి, "మంచి పెళ్లి సంబంధం కుదరాలి, ఇంట్లో శుభకార్యం జరగాలి" అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదివి హారతి ఇవ్వాలి.

6. గడప దగ్గర వెలిగించిన దీపానికి నమస్కరించి, సూర్యోదయం వరకు ఉంచి తరువాత తీసివేయాలి.

7. పూజ పూర్తయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు. కనీసం అరగంట సమయం గడిచిన తరువాత నిద్రపోవచ్చు.

8. ఆ పదహారు రోజులూ పూజా గదిలో దీపం వెలిగించి ఉంచితే చాలా శుభప్రదంగా ఉంటుంది.

పెళ్లి కాని అబ్బాయిల కోసం

పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి, "మంచి అమ్మాయి భార్యగా రావాలి" అని ప్రార్థించాలి.

లేదా ఆ అబ్బాయి తల్లి, తన కుమారుడికి సంబంధించిన ఏదైనా వస్త్రాన్ని భుజాన వేసుకుని, "ఈ ఇంటికి మంచి కోడలు అడుగుపెట్టాలి" అని సంకల్పం చేసుకుని 16 రోజుల పాటు ఈ గడప పూజ చేయవచ్చు.

చెప్పిన విధంగా గడపకు పూజ చేసి, లక్ష్మీనారాయణ అష్టోత్తరం, మణిద్వీప వర్ణన చదివి హారతి ఇవ్వాలి.

శ్రీ మహాలక్ష్మీ కటాక్షం సదా మీ ఇంటిపై ఉండాలని కోరుకుంటూ

గమనిక: పై విధానం సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ప్రచారంలో ఉన్న ఆచారం. వివిధ కుటుంబాలు, ప్రాంతాలు, సంప్రదాయాల ప్రకారం పద్ధతుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

జ్ఞానంచేత బ్రాహ్మణుడు!                ➖➖➖✍️ఈ పై ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి. నిశితంగా గమనించండి. మీకేమనిపిస్తోంది?ఆయనొ...
13/06/2026

జ్ఞానంచేత బ్రాహ్మణుడు!
➖➖➖✍️

ఈ పై ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి. నిశితంగా గమనించండి. మీకేమనిపిస్తోంది?

ఆయనొక బ్రాహ్మణుడు...

వేదాలు చదివిన పండితుడు లేదా పూజలు చేయించే బ్రహ్మ గారు లాగా అగుపిస్తున్నారు కదూ!

కాదు…!
ఆయననొక పేరుమోసిన డాక్టరు... ఆంకాలజిస్టు.. కాన్సర్ స్పెషలిస్టు. కేరళలోనే మొట్టమొదటి ఆంకాలజిస్టు ఆయనే. కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్ మెంటు గానూ, తరువాత కొట్టాయం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గాను పనిచేశారు.

ఆయన 60సం.ల వయసులో రిటైరైన తరువాత ఒక ఫ్లయింగ్ డాక్టరుగా పేరుతెచ్చుకున్నాడు. అంటే 50 దేశాలకు ఆయన విజిటింగ్ ప్రొఫెసరుగా వెళ్ళి ఆంకాలజీ మీద లెక్చర్లు, రోగులకు చికిత్స చేసేవారు.

ఆయన ఎదురుగా కూర్చున్న వ్యక్తి పేరు బ్రహ్మశ్రీ సూర్యన్ సుబ్రమనియన్ భట్టాత్తిరి. సిద్ధ వైద్యుడు.

అంతపెద్ద వయసులో ఆ ఆంకాలజీ స్పెషలిస్టుగారికి తను చదివింది చదువుకాదు, తనవైద్యం ఒక లెక్కలోనిది కాదు, అవన్నీ వ్యర్ధం అనిపించింది.

మళయాళంలో…. “అ లాడా వైద్యన్“ అంటే ఒక గిరిజన వైద్యుడన్నమాట. అలాంటి సిద్ధవైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. పట్టుదలతో సిద్ధవైద్యం నేర్చుకున్నాడు. ఈ గొప్పవైద్యుడు సిద్ధవైద్యంతో అనేకమంది రోగులను కాపాడాడు. అమెరికాలోని ప్రఖ్యాత ‘మాయ క్లినిక్’ తిరస్కరించిన రోగులను కూడ ఈయన తన సిద్ధ వైద్యంతో బ్రతికించాడు.

ఆయన వైద్యంతో బాటుగా, వేదాలుఉపనిషత్తులను భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాడు. అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకి ప్రఖ్యాతిగాంచిన ‘సూర్యకాలాది మాన’ అనుసరించి “ఉపనయన సంస్కారం" పొంది మెడలో జంధ్యం, రుద్రాక్షమాల ధరించారు. ఆయన జీవితమంతా ‘సనాతన ధర్మాన్ని’ పాటిస్తూ సనాతన ధర్మాచార్యుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు.
ఆయన 92 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే 20 అక్టోబరు 2021 తేదీన పరమపదించారు.
ఏ ఒక్కమీడియా సంస్థ ఆయన గురించి రాయలేదు. కమ్యూనిస్టు కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయనలోని విద్యా సరస్వతికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే.

మీకు ఉత్కంఠగా ఉంది కదూ! ఆయన పేరేమిటో తెలుసుకోవాలనీ, ఆయన నేపధ్యం ఏమిటో తెలుసుకోవాలనీ ఆతృతగా ఉంది కదూ!

ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందిన ఒక క్రిస్టియన్...!

అవునండీ ఆయన ఒక క్రిస్టియన్..!
ఆయన పేరు CP మాథ్యూ.. సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మమంటే, అది మతం కాదు ఒక జీవన విధానమనీ, అదొక సైన్సు ఆధారితమనీ మూఢత్వం కాదనీ తెలుసుకుని, ఆచరించి, బోధించిన మహనీయుడు.

అతిముఖ్యమైన విషయం, ఆయన జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా, ఆయన జ్ఞానంచేత బ్రాహ్మణుడై, ఉపనయన సంస్కారం పొంది, బ్రాహ్మణుడిగా జీవించిన CP మాథ్యూగారు ధన్యుడు..!

సనాతన ధర్మాన్నీ, కులాలను విమర్శించే వారికి ఆయన జీవితం ఒక కనువిప్పు కలిగించగలదు 🙏

నంది చెవిలో చెబితే అనుకున్న పనులన్నీ క్షణంలో అయ్యిపోతాయటసాధారణంగా దేవాలయాలలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు.దీ...
10/06/2026

నంది చెవిలో చెబితే అనుకున్న పనులన్నీ క్షణంలో అయ్యిపోతాయట

సాధారణంగా దేవాలయాలలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు.
దీనికి ఒక కథ ఉంది.

ఒకసారి శివుడు, పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారట.
అదే సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతి మాతను అపహరించాలని ప్రయత్నం చేశాడు.

ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు
ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకున్నాడు..
కాని వినాయకుడు, ఇతర దేవతలు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరికి వెళ్ళే సాహసం ఎవ్వరు చెయ్యలేదట.

అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే ఖచ్చితంగా శివునికి చేరుతుందని నందికి ఆ విషయం చెప్పారట.
ఆ విషయం తెలుసుకున్న వెంటనే శివుడు రాక్షసుడిని సంహారించారు.

ఇక అప్పటి నుండి నంది చెవిలో చెబితే శివునికి చేరుతుందని ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
స్వస్తి.

Address

Guntakal

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasavi creative photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vasavi creative photography:

Share

Category