V5 News Reporter ARJUN

V5 News Reporter ARJUN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from V5 News Reporter ARJUN, Visakhapatnam.

28/02/2022

రష్యా సైనికుడిని ఎదిరిస్తున్న ఉక్రెయిన్ బాలిక......

*_ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా కకావికల_*_ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా ఆశ నెరవేరడం అంత సులువు కాదనే వ...
28/02/2022

*_ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా కకావికల_*

_ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా ఆశ నెరవేరడం అంత సులువు కాదనే విషయం ఆ దేశానికి అర్థమైంది. భారీగా యుద్ధట్యాంకులు, క్షిపణి దాడులు, వైమానిక దాడులతో రష్యా విరుచుకుపడింది._
_రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధ సామగ్రి అతి స్వల్పం అయినప్పటికీ గుండె ధైర్యంతో పోరాడింది. రాజధాని కీప్ సరిహద్దుల్లోనే రష్యా సేనలనునిలువరించింది. భీకరంగా పోరాడి రష్యా_ _సైన్యంలో అత్యంత శక్తివంతమైన కమాండర్లను మట్టుబెట్టింది. ఇక ఆ దేశంలో రెండో అతి పెద్ద_
_నగరం ఖార్కీవ్ ను రష్యా సేనలుస్వాధీనంచేసుకున్నాయికొద్దిసేపట్లోనే తిరిగి ఉక్రెయిన్ తమ స్వాధీనంలోకి_ _తెచ్చుకుంది.ఈ క్రమంలో ఆ దేశం అనుసరించిన వ్యూహం వింటే నిజంగాఆశ్చర్యం అనిపిస్తుంది. రహదారులపై మార్గాలను తెలిపేసూచిక బోర్డులను మార్చేసింది._ _ఫలితంగా ఆ నగరంలోకి వచ్చిన రష్యా సేనలు దారి తప్పాయి. ఈలోపు అన్ని వైపుల నుంచి దాడి చేసి, తమ నగరానికి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి ఉక్రెయిన్ సేనలు._

భారతీయుడా తిప్పరా మీసం..తొడ కొట్టి చెప్పు నాది భారత్  మా ప్రధాని మోదీ అని..ఇవాళ నీ జెండా కి ఉన్న పోగారెంతంటేనీ జెండా చూస...
27/02/2022

భారతీయుడా తిప్పరా మీసం..

తొడ కొట్టి చెప్పు నాది భారత్ మా ప్రధాని మోదీ అని..

ఇవాళ నీ జెండా కి ఉన్న పోగారెంతంటే

నీ జెండా చూసి AK 203 నుంచి వచ్చే బుల్లెట్స్ ఆగి పోయేటంత..

గురి పెట్టిన మిసైల్స్ కూడా ఒక్క క్షణం ఆగి అది భారతీయుని జెండా అని ఆలోచించేటంత...

ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన ప్రపంచ ప్రజలను రక్షించుకునేందుకు ఆగ్ర దేశాలు అంటూ వీర్రవీగే అమెరికా, బ్రిటన్ లు సైతం అల్లాడతుంటే. భారతీయులు మాత్రం త్రివర్ణపతాకాన్ని చేత బట్టి అవలీలగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నారంటే మోడీ లాంటి సమర్ధ నాయకుడు భారత్ కి ఉండడమే.

మన విమానాలు ఆకాశంలో ఎగురుతుంటే మేఘాలు సైడ్ ఇస్తున్నట్లు రష్యా ఫైటర్ జెట్స్ సైడ్ ఇచ్చి మరీ సెక్యూరిటీ గా తోడొచ్చి సరిహద్దులు దాటిస్తున్నాయంటే ఇంతకంటే గర్వం నికేముంది అందుకే మీసం తిప్పి తొడకొట్టి చెప్పు నేను భారతీయుడినని, మా నాయకుడు మోదీజీ అనీ.

భారత్ మాతాకి జై ✊

V5 NEWS REPORTER ARJUNప్రజలను ఆకర్షిస్తున్న మిలన్ రిహార్సల్స్,,విశాఖ అర్బన్,బీచ్ రోడ్డు,విశాఖ నగరంలో జరుగుతున్న ఇండియన్ ...
26/02/2022

V5 NEWS REPORTER ARJUN

ప్రజలను ఆకర్షిస్తున్న మిలన్ రిహార్సల్స్,,
విశాఖ అర్బన్,బీచ్ రోడ్డు,విశాఖ నగరంలో జరుగుతున్న ఇండియన్ నేవీ అద్వర్యంలో జరుగుతున్న మిలన్ సందర్భముగా నిర్వహిస్తున్న సన్నాహక విన్యాసాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని బీచ్ కు వొచ్చే సందర్శకులు చెబుతున్నారు,,ఫిబ్రవరి 24నుంచి సన్నహక విన్యాసాలు జరుగుతున్నాయి అని ఫైనల్ సన్నహక విన్యాసాలు ఫిబ్రవరి 26న జరుగుతాయి అని ప్రధాన విన్యాసాలు ఫిబ్రవరి27న జరుగుతాయి అని నౌకాదళ అధికారులు చెబుతున్నారు,,, మధ్యహ్నము 3-30నుంచి రాత్రి7-30వరకు జరుగుతాయి అని చెప్పారు,,ఇందులో భాగముగా నౌక విన్యాసాలు,విమాన హెలికాప్టర్ విన్యాసాలు జరుగుతాయి అని అలాగే సాయత్రం 6-30కు ఇతర దేశాల నుంచి వొచ్చిన నౌకాదళ సిబ్బంది మరియు స్తానిక కళాకారులతో పెరేడ్ జరుగుతుంది అని ఇందులో యన్ సి సి,కోస్ట్ గార్డ్,స్పెషల్ ఫోర్స్,ఇండియన్ నేవీ వెటరన్స్,ఇండియన్ నేవీ బ్యాండ్ ట్రూప్,యెన్ యస్ జి గార్డ్స్,ఇండియన్ నేవీ మార్చ్ ఫాస్ట్ గ్రూప్,ఏపి పోలీస్ బ్యాండ్ ట్రూప్,ఏపి పోలీస్ మార్చ్ ఫాస్ట్ గ్రూప్,కోరుకొండ సైనిక్ స్కూల్ మార్చ్ ఫాస్ట్ ప్లాటూన్,బ్యాండ్ ప్లాటూన్, వాటి వెనుక మలేసియా నౌకాదళ ప్లాటూన్,మయన్మార్ నౌక దళ ప్లాటూన్, సి శెల్స్ నౌకాదళ ప్లాటూన్,అమెరికా నౌకాదళ ప్లాటూన్,ఇంకా ఇతరదేశాల నౌక దళ ల ప్లాటూన్ సిబ్బంది,మరియు వీరితో పాటు స్థానిక గరగ నృత్య,కళాకారులు,థింసా నృత్య కళాకారులు,కూచిపూడి కళాకారులు, తప్పెడ గుళ్ళు కళాకారులు ,తదితర కళాకారులు కూడా తమయోక్క కళారూపాలను ప్రదర్శిస్తూ పెరేడ్ లో పాల్గొంటారని వారి వెనుక విశాఖ స్మార్ట్ సిటీ శకటం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నా సంక్షేమ పథకాల శకటం,పచ్ హత్తర్ సాల్ అజాది క అమృత్ మహోత్సవ శకటం పెరేడ్ లో పాల్గొంటాయి అని నౌక దళ అధికారులు చెబుతున్నారు,,మిలన్ విన్యాసాల సందర్భముగా పోలీస్ లు బీచ్ రోడ్డులో మరియు విశాఖ నగరంలోని ఇతర ప్రాంతాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు,,మిలన్ సందర్భముగా సముద్రంలో వున్న భారత నౌకా దలానికి చెందిన నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించారు,,మిలన్ సందర్భముగా నిర్వహిస్తున్న విన్యాసాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని బీచ్ కు వొచ్చే సందర్శకులు చెబుతున్నారు,,,

Visakhapatnam City Police Commissioner of Police was informed that...

LED screens at public places

1 Collectorate
2. AU BAsket Ball grounds
3. MGM Ground
4. AMCOSA
5. AVN College ground
6. Central Park
7. AS Raja College
8. Smart city park
9. Jalaripeta( will be installed tomorrow morning)

two special Air India flights : యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. కీవ్ నుంచి రొమేనియా చేరుకున్న విద్య...
26/02/2022

two special Air India flights : యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. కీవ్ నుంచి రొమేనియా చేరుకున్న విద్యార్థులు ఇవాళ భారత్ చేరుకోనున్నారు.
రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో 470 మంది స్వదేశానికి రానున్నారు. రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయల్దేరాయి. ఉదయం 10.30 గంటలకు ఎఐ 1942 విమానం ఢిల్లీ చేరుకోనుంది. మరో ఎఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకు చేరుకోనుంది.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరారు. తరలింపు ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం తెలిపింది. యుక్రెయిన్ నుంచి వస్తున్న వారిలో 22 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రానున్న 13 మంది, ముంబైకి రానున్న 9 మంది విద్యార్థులు రానున్నారు.

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి                                                                                      ...
26/02/2022

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి
ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో ఏడుగురు మరణించగా, మరో 85 మంది గాయపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ సుమత్రా దీవుల్లోని పసమాన్ బరత్, పసమాన్ జిల్లాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు దాదాపు పదివేలకు పైగా ఇండ్లు, బిల్డింగులు ధ్వంసమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఐదు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 35 ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు. బాధితుల్ని ఆదుకునేందుకు ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, కనిపించకుండా పోయిన ప్రజల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ సేన రష్యా బలగాలకు పట్టపగలే చుక్కలు..Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు, ఆ దేశ సై...
26/02/2022

తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ సేన రష్యా బలగాలకు పట్టపగలే చుక్కలు..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు, ఆ దేశ సైనికులకు మధ్య భీకర పోరు నడుస్తోంది. ఎంతో ఆయుధ సంపత్తి ఉండి అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్‌ కలిగిన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడి భారీ నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది.

గత మూడు రోజులుగా జరుగున్న యుద్దంలో ఉక్రెయిన్‌ సైన్యం తగ్గేదేలే అంటూ తమ సామర్థ్యానికి మించి పోరాడుతోంది. రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్నట్లు పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్‌బుక్ పేజీలో తాజాగా పేర్కొంది. అంతేకాకుండా మరో 200 మంది రష్యా సైనికులను తాము అరెస్టు చేసినట్లు కూడా గర్వంగా వెల్లడించారు. ఈ క్రమంలో తమ దేశ సైనికులు రష్యాకు చెందిన 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను, 536 ఆర్మీ వాహనాలను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
కాగా, సైనికుల మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రష్యా ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు కీవ్‌ నగరం వద్ద రష్యా బలగాలకు, ఉక్రెయిన్‌ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ బలగాలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.

26/02/2022

V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్

ఉక్రెయిన్ నుండి మోదీ ప్రభుత్వం వెనక్కు తెస్తున్న.. భారతీయుల మొదటి బ్యాచ్..

మొదట వారిని ఉక్రెయిన్ నుండి రుమేనియా సరిహద్దుల వద్దకు.. అక్కడి నుండి రుమేనియా రాజధాని బుఖారెస్ట్‌కు.. తరలించి.. అక్కడి నుండి నేరుగా భారత్‌కు తీసుకురానున్నారు..!

నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు వారికి తిండి బస తో సహా అన్ని ప్రయాణ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకొంటున్న భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ.

V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్*వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి* కట్టుబట్టలతో బంకర్లు, అండర్‌ గ్రౌండ్...
26/02/2022

V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్

*వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి*
కట్టుబట్టలతో బంకర్లు, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో తెలుగు విద్యార్థులు
అమరావతి: ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్‌ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్‌ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్‌ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్‌ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

23/02/2022

V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్

ఉదయగిరి మెరిట్ కళాశాలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి పూర్తయిన ఏర్పాట్లు.

గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్

విశాఖపట్నం జిల్లా V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్/ విశాఖ : ఆనందపురంపురం మం కల్లివానిపాలెంలో పిల్లి పైడిరెడ్డి (40)అనే ఆటో డ్...
23/02/2022

విశాఖపట్నం జిల్లా V5 న్యూస్ రిపోర్టర్ అర్జున్/

విశాఖ : ఆనందపురంపురం మం కల్లివానిపాలెంలో పిల్లి పైడిరెడ్డి (40)అనే ఆటో డ్రైవర్ ను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
భూ తగాదాలే కారణమని సమాచారం

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when V5 News Reporter ARJUN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V5 News Reporter ARJUN:

Share